ఆర్బీఐ నివేదికలో ఏపీ టాప్... ఎందులో అంటే...!

  • ఆర్బీఐ నివేదికలో ఏపీకి పలు అగ్రస్థానాలు
  • పండ్లు, చేపల ఉత్పత్తిలో దేశంలోనే నంబర్ 1
  • రూ.15.93 లక్షల కోట్లకు చేరిన రాష్ట్ర జీఎస్‌డీపీ
  • సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనలో 10వ ర్యాంక్
భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) విడుదల చేసిన తాజా నివేదికలో ఆంధ్రప్రదేశ్ పలు కీలక రంగాల్లో తనదైన ముద్ర వేసింది. ముఖ్యంగా పండ్లు, చేపల ఉత్పత్తిలో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని ఈ నివేదిక స్పష్టం చేసింది.

వివరాల్లోకి వెళితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 1 కోటి 93 లక్షల టన్నుల పండ్లను ఉత్పత్తి చేస్తూ దేశంలోనే మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. అదేవిధంగా, 51.58 లక్షల టన్నుల చేపల ఉత్పత్తితో మత్స్య రంగంలోనూ ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా కొనసాగుతోంది.

ఉత్పత్తి రంగాల్లోనే కాకుండా, ఆర్థికంగానూ రాష్ట్రం స్థిరమైన వృద్ధిని కనబరుస్తున్నట్లు నివేదిక వెల్లడించింది. 2024–25 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ) రూ.15.93 లక్షల కోట్లుగా, తలసరి జీఎస్‌డీపీ రూ.2.66 లక్షలుగా నమోదైంది.

ఇతర ముఖ్య సూచికలను పరిశీలిస్తే, విద్యుత్ లభ్యతలో రాష్ట్రం 1481 యూనిట్లతో దేశంలో 14వ స్థానంలో ఉంది. ప్రజల ఆరోగ్యానికి సంబంధించి, ఆంధ్రప్రదేశ్లో సగటు ఆయుర్దాయం 70 ఏళ్లుగా నమోదైంది. ఇందులో పురుషుల సగటు జీవితకాలం 68 సంవత్సరాలు కాగా, మహిళల సగటు జీవితకాలం 73 ఏళ్లుగా ఉంది.

Andhra Pradesh
AP
RBI Report
Fruits Production
Fish Production
GSDP
Economic Growth
Sustainable Development Goals
SDG
Average Life Expectancy

More Telugu News